by Suryaa Desk | Tue, Oct 01, 2024, 07:28 PM
గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను నియంత్రించవచ్చని ఎస్సై రమేష్ అన్నారు. మంగళవారం ధన్వాడ పోలీస్ స్టేషన్ లో గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. సిసి కెమెరాల ఏర్పాటుతో కలిగే లాభాలను వివరించారు. దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు ముందుకు రావాలని కోరారు. గ్రామ పెద్దలు సానుకూలంగా స్పందించారని, త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.