by Suryaa Desk | Sat, Oct 19, 2024, 08:39 PM
నటి రేణూ దేశాయ్ ఇటీవల తన నివాసంలో భక్తి శ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. శరద్ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమంలో ఆమె తనయుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా ఇన్స్టాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది. సంస్కృతి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొన్నారు. ‘పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలి’ అని రాసుకొచ్చారు.
Latest News