![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 05:42 PM
రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి వాటా వెళ్లడమే తప్ప కేంద్రం నుంచి నిధులు రావడం లేదని విమర్శించారు. రూ. 6 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా హామీలను నెరవేర్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని అన్నారు. ఖర్చు పెట్టకుండా ఆదాయం వచ్చే రంగాలను అన్వేషించాలని ఆయన అన్నారు. జనాభాలో సగం మందికి బడ్జెట్ ఫలాలు అందేలా లేవని అన్నారు.