|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 07:05 PM
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలను వాతావరణశాఖ హెచ్చరించింది. రాగల 2 రోజులు రాష్ట్రంలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా SRD, MDK, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండనుందని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.