![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 06:17 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తిర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీనివల్ల రాష్ట్రంలో అటవీ కవచం 7 శాతం పెరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కల్లో ప్రజలకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అన్నారు. ఈ చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తికి హానికరంగా మారతాయని పక్షులకు కూడా సహజమైన వాతావరణాన్ని అందించలేవని చెప్పారు. వేముల మాట్లాడుతూ ఈ చెట్లను కొద్ది సంఖ్యలోనే నాటామని చెప్పారు. మీరు చెప్పింది కరెక్ట్ కాదని ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటారని స్పీకర్ కౌంటర్ ఇచ్చారు. హైవేలు, డివైడర్లు సహా అనేక ప్రాంతాల్లో ఈ చెట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.