![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 03:58 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు విజనరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌలి మొదటిసారి గ్లోబ్-ట్రోటింగ్ యాక్షన్-అడ్వెంచర్ 'SSMB 29' కోసం జతకట్టారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనాస్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ ని మేకర్స్ ఏప్రిల్ 15న హైదరాబాద్ లో ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. SSMB29 ను ప్రముఖ చిత్రనిర్మాత కెఎల్ నారాయణ 1,000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త MM కీరావాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్కు చెందిన కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించి మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News