|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 04:13 PM
అయేషా ఖాన్ ఏక్తా కపూర్ డైలీ సోప్ ' కసౌతీ జిందగీ కే 'లో జూనియర్ ఆర్టిస్ట్గా టెలివిజన్ అరంగేట్రం చేసి, 2019లో టెలివిజన్ షో 'బల్వీర్ రిటర్న్స్'లో ప్రతికూల పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని 2022లో తెలుగు సినిమా ముఖచిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.అయేషా ఖాన్ జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్ను ప్రారంభించి, ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనంగా మారింది. ముంబైకి చెందిన ఈ నటి మోడల్గా తన వృత్తిని మొదలుపెట్టి, ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది.బాలీవుడ్ లో ఏక్తా కపూర్ తెరకెక్కించిన డైలీ సోప్ కసౌతీ జిందగీ కేలో జూనియర్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసింది. 2019లో బాలవీర్ రిటర్న్స్ సీరియల్లో నెగెటివ్ రోల్లో నటించి గుర్తింపు పొందింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.విశ్వక్ సేన్తో ఓ చిత్రంలో డ్యాన్స్ నంబర్లో కనిపించి, "మోత మోగిపోద్ది" అంటూ అభిమానులను అలరించింది. రీసెంట్ గా సన్నీడియోల్ నటించిన జాట్ మూవీలోనూ మెరిసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఎర్ర చీరలో కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Latest News