|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:55 AM
విదు, తెలుగమ్మాయి ప్రీతి అశ్రాని జంటగా విభిన్నమైన కాన్సెప్ట్తో తమిళంలో రూపొందుతున్న చిత్రం '29'. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన జీ స్క్వాడ్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తోండగా రత్నకుమార్ రచయిత, దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పేరును ప్రకటిస్తూ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసి '29' అనే పేరును అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉంది.ఓ అమ్మాయి చాలామందిని నీవెవరు అని ప్రశ్నించడం వాళ్లు వారి పేర్లు, చేస్తున్న ఉద్యోగాలు చెప్పడం జరుగుతుంది. చివరకు ఓ యువకుడిని నీవెవరు అని అడగ్గా మరో ఆలోచన లేకుండా నాకు తెలియదు అని చెప్పేయడం, ఆ క్రమంలో నేనెవరిని అని తనలో తానే ఆలోచించుకోవడం చివరకు బస్సులో తన పక్కే కథానాయిక వచ్చి కూర్చోవడం వంటి సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉన్నాయి.
Latest News