|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:22 PM
బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ తన దర్శకత్వ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ, దర్శకురాలిగా మారేందుకు తాను ప్రస్తుతం సిద్ధంగా లేనని ఆమె స్పష్టం చేశారు. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలను పంచుకున్నారు."మీకు 40 ఏళ్ల అనుభవం ఉంది కదా, దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచన ఉందా?" అని అడిగిన ప్రశ్నకు మాధురి బదులిస్తూ, "చాలామంది నన్ను ఇదే అడుగుతారు. ఇన్నేళ్లలో ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేశాను, వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ దర్శకత్వం అనేది నేను పూర్తిగా సిద్ధమయ్యాకే చేయాలి. ప్రస్తుతానికి నేను సిద్ధంగా లేను. బహుశా భవిష్యత్తులో ప్రయత్నిస్తానేమో" అని తెలిపారు.ఈ సందర్భంగా తన తొలి చిత్రం ‘అబోధ్’ సమయం నుంచి ఇప్పటి సినిమా నిర్మాణంలో వచ్చిన మార్పులను ఆమె వివరించారు. "అప్పట్లో యశ్ చోప్రా, బీఆర్ చోప్రా, సుభాష్ ఘయ్ వంటి ఐదారుగురు నిర్మాతలు మాత్రమే చాలా పద్ధతిగా ఉండేవారు. మిగతా సినిమా నిర్మాణం అసంఘటితంగా సాగేది. కానీ ఈ రోజుల్లో ప్రతీది చాలా ఆర్గనైజ్డ్గా ఉంది" అని ఆమె అన్నారు.
Latest News