|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 02:58 PM
బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి టాలీవుడ్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్నప్పటికీ, అలియా కోసం ఒక పవర్ఫుల్ పాత్రను దర్శకుడు రూపొందించినట్లు తెలుస్తోంది. గతంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో సీతగా నటించిన అలియా, 'ఆల్ఫా' అనే యాక్షన్ ఎంటర్టైనర్లో కూడా స్పై పాత్రలో కనిపించనుంది.
Latest News