|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:22 PM
దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత నటి సమంత తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. శనివారం మధ్యాహ్నం ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ నూతన జంట కెమెరాల కంటపడింది. చాలా సింపుల్గా, సాధారణ దుస్తుల్లో కనిపించిన వీరిని చూసి ఫోటోగ్రాఫర్లు శుభాకాంక్షలు తెలిపారు. దానికి వారు చిరునవ్వుతో ధన్యవాదాలు తెలియజేశారు.ఈ నెల 1న కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్లో సమంత, రాజ్ అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో లింగ భైరవ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్తో ధ్రువీకరించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగిన వీరి పెళ్లి వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.గత ఏడాది నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ పుకార్లు వినిపిస్తున్నా, వారు ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ సెట్లో మొదలైన వీరి పరిచయం, 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రాజెక్ట్ సమయంలో ప్రేమగా మారిందని తెలుస్తోంది. అంతకుముందు సమంత, నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకొని విడిపోయారు. అటు రాజ్ నిడిమోరుకు కూడా 2015లో వివాహం కాగా, 2022లో విడిపోయినట్లు ప్రచారం జరిగింది.
Latest News