|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:52 AM
తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచేందుకు 'గుర్రం పాపిరెడ్డి' అనే వెరైటీ డార్క్ కామెడీ చిత్రం సిద్ధమైంది. యంగ్ హీరో నరేష్ ఆగస్త్య, 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమా రేపు (డిసెంబర్ 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి కథాంశం రాలేదని, ఇది ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ.. మన నేటివిటీకి దగ్గరగా ఉంటూనే, తెలుగులో ఇంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించామని తెలిపారు. నిర్మాతలు సైతం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.ఈ సినిమాలో తాను నాలుగు విభిన్న గెటప్స్లో, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పాత్రలో కనిపించనున్నట్లు హీరో నరేష్ ఆగస్త్య చెప్పారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. తాను సౌదామిని అనే విభిన్న పాత్ర పోషించానని వెల్లడించారు.
Latest News