|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:16 PM
ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ చూడాలని ఉందని, సెట్కు రావొచ్చా అని కామెరూన్ అడగటం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఊహించని మాటకు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు.విజువల్ వండర్గా పేరుగాంచిన ‘అవతార్’ ఫ్రాంచైజీలో మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం భారత్లో ప్రత్యేక ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాజమౌళి సహా కొంతమంది సినీ ప్రముఖులకు ‘అవతార్ 3’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం జేమ్స్ కామెరూన్, రాజమౌళి వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది.సినిమా చూసిన అనుభూతిని పంచుకుంటూ, "అవతార్ 3 చూస్తున్నంత సేపు ఓ చిన్న పిల్లాడిలా మారిపోయాను. విజువల్స్, పాత్రల రూపకల్పన అద్భుతం. ఈ ఫ్రాంచైజీ వెండితెరకు ఒక బెంచ్మార్క్" అని రాజమౌళి ప్రశంసించారు.
Latest News