![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 04:16 PM
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి అసత్య ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. పార్టీపై తాను పూర్తి నమ్మకంతో ఉన్నానని, బీఆర్ఎస్ పార్టీకి నష్టమేమీ కలిగించబోనని స్పష్టం చేశారు.తనపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. పరువు నష్టం దావా వేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. తన చివరి శ్వాస వరకు బీఆర్ఎస్తోనే ఉంటానని, ముఖ్యంగా కేసీఆర్ను వీడబోనని స్పష్టం చేశారు. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తన కుటుంబమని, కేసీఆర్ తన నాయకుడని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటానని, ఎవరూ తన అనుబంధాన్ని తెంచలేరని చెప్పుకొచ్చారు. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణను చూసి కొంతమంది అసహనానికి లోనవుతున్నారని, అందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు.తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని, అబద్దపు ప్రచారాలను నమ్మొద్దని తన పార్టీ శ్రేణులకు సూచించారు.