![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 04:19 PM
గుండె పోటుతో హోంగార్డు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో చోటుచేసుకున్నది. నాగ్సన్ పల్లికి చెందిన మహేందర్ (32) మెదక్ రూరల్ PSలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మహేందర్ మృతి చెందారు. గుండె పోటు వల్లే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.