|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 11:32 AM
మార్చి 21న నకిరేకల్ గురుకులంలో టెన్త్ ఎగ్జామ్ మొదలైన కాసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఎగ్జామ్ పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, నకిరేకల్ ఎంఈవో నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బార్ కోడ్ ఆధారంగా నకిరేకల్లోని ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి లీకైనట్లు గుర్తించారు. గోడ దూకి వచ్చిన వ్యక్తి పరీక్ష హాల్ కు వెళ్లి ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసినట్లు విచారణలో తేల్చారు. ఎగ్జామ్ సెంటర్ సీఎస్ గోపాల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రామ్మోహన్ రెడ్డిని పరీక్ష విధుల నుంచి తప్పించగా, ఇన్విజిలేటర్ సుధారాణిని సస్పెండ్ చేశారు. స్టూడెంట్ను డిబార్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ప్రశ్నాపత్రం ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసింది 11 మందిగా తేల్చి అరెస్ట్ చేశారు.