![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 01:13 PM
అమీన్పూర్ లో ముగ్గురు పిల్లలకు అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు. వివాహేతర సంబంధం కారణంగా భర్త, పిల్లలని చంపేయాలని ప్లాన్ చేసిన రజిత(45). ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టు గెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకి ఏర్పడ్డ పరిచయం . పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ప్రియుడితో కలిసి ఉండాలని నిర్ణయం. గత నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషపదార్థం కలిపిన తల్లి. భర్త చెన్నయ్య పెరుగు తినకుండా డ్యూటికి వెళ్లిపోవడంతో పిల్లలకు పెరుగన్నం పెట్టిన నిందితురాలు. ఉదయం చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి విగతజీవులుగా పడి ఉన్న ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(08). కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించిన భర్త చెన్నయ్య. మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు. విచారణలో బయటపడ్డ రజిత బాగోతం