|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 02:46 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు వారికి జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లు ఇకపై అంగన్వాడీ టీచర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ, మెయిన్ అంగన్వాడీ అనే తేడా ఉండదు. కాగా, గతంలో మినీ అంగన్వాడీలకు రూ.7800 జీతం మాత్రమే ఇస్తుండగా.. తాజా నిర్ణయంతో వారికి రూ.13,650 జీతం అందనుంది. పెంచిన వేతనం ఏప్రిల్ నెల నుంచి అకౌంట్లలో జమ కానుంది. అయితే, జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 అంగన్వాడీ టీచర్లుఆనందం వ్యక్తం చేస్తున్నారు.