|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 03:50 PM
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. HYD-మిషన్ భగీరథ కార్యాలయంలో అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తాగునీటి సరఫరాపై సమీక్షించారు. గతంలో తాగునీరు అందని గ్రామాలకు ఈసారి తాగునీరు అందేలా చూడాలన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.