|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 10:08 AM
బెట్టింగ్ బారిన పడి మరో యువకుడు ఆత్మహత్య . మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెళ్ళి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ యాదగిరి రెండో కుమారుడు రాహుల్ (24) ఇంటర్ వరకు చదివి ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రాహుల్ మద్యం తాగడం, క్రికెట్ బెట్టింగులు వేయడానికి బానిసగా మారాడు, అప్పు చేసి ఐపీఎల్ బెట్టింగ్లో డబ్బులు పెట్టగా, రూ.4 లక్షలు నష్ట పోయాడు . దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి, ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకున్న రాహుల్.బెట్టింగ్ భూతం యువకుల్ని వదలడం లేదు. బెట్టింగ్ యాప్స్ బారిన పడి యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య పెరిగాయి. ఆన్లైన్ బెట్టింగ్, ఈజీ మనీ ఆశతో చాలా మంది డబ్బులు, ఆస్తులు పొగొట్టుకొని, ఆర్థిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి