|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 02:53 PM
అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దండోరా' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్స్ వేదికగా ఆయన మాట్లాడుతూ, 'ఇప్పుడే దండోరా సినిమా చూశాను. ఇది ఎంతో లోతైన, శక్తివంతమైన మరియు ఆలోచింపజేసే చిత్రం. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవిలు తమ నటనతో సినిమా ఆద్యంతం అద్భుతంగా రాణించారు. ఇంతటి బలమైన రచనతో, మన మూలాలకు దగ్గరగా ఉండే కథను ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్ గారికి నా హ్యాట్సాఫ్' అని పేర్కొన్నారు.
Latest News