![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 11:24 AM
రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించడం చారిత్రాత్మకమని మాజీ కౌన్సిలర్ వి. చంద్రారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు. బొల్లారం మున్సిపాలిటీలోని జ్యోతి థియేటర్ ముందు రాహుల్ గాంధీ, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.