|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:23 PM
మున్సిపల్ ఎన్నికల హడావుడి జోరందుకుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో బీజీపీ కీలక ప్రకటన చేసింది. బీజేపీకి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు.పవన్ కల్యాణ్ తో తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయినట్టు రాంచందర్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారని... బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని పేర్కొన్నారు.