![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 03:39 PM
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్లో దాదాపు 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ కేంద్రం ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.