|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:46 PM
పటాన్చెరు : ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ కు చెందిన సుశీల్ కుమార్ శర్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ఎల్ ఓ సి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని ఎమ్మెల్యే జిఎంఆర్ బుధవారం పటాన్చెరు లోని తన కార్యాలయంలో సుశీల శర్మ కుటుంబ సభ్యులకు అందజేశారు.