by Suryaa Desk | Sun, Jul 14, 2024, 11:03 AM
పెద్దపెల్లి జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి పెద్దపట్నం మహోత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య తెలిపారు. ఆదివారం రాత్రి సమయంలో మల్లికార్జున స్వామి పెద్దపట్నం, సోమవారం తెల్లవారు జామున అగ్నిగుండాల ప్రవేశం ఉంటుందని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.