by Suryaa Desk | Sun, Aug 11, 2024, 06:20 PM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ అధికారులు, పాలకవర్గం మొండి వైఖరిని విడనాడాలని ఆదివారం మున్సిపల్ కార్మికుల పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు యాదమ్మ అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పట్టణంలోని నేతాజీ చౌక్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.