by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:09 PM
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.విద్యార్థులు ఉపాధ్యాయులు రంగు రంగు పూలతో బతుకమ్మలు పేర్చి, బతుకమ్మ పాటలతో అలరించారు. ప్రధానోపాధ్యాయులు హిమబిందు మాట్లాడుతూ తెలంగాణ లో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయన్నారు.
ప్రకృతినిపూజించే పండుగ బతుకమ్మ అని, ప్రేమానురాగాలకు ప్రతీక అని, ఆడబిడ్డలతో జరుపుకునే పండగ బతుకమ్మ అని అభివర్ణించారు. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, ఆట పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి,రజిత, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.