by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:30 PM
జగిత్యాల జిల్లా బుగ్గారం కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో పాఠశాలకు చేరుకొని వివిధ రంగుల పూలను బతుకమ్మ పేర్చి ఉత్సాహంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి ఉపాధ్యాయులు శ్రీనివాస్, రవి ప్రసాద్, లచ్చయ్య, మనోహర్, అశోక్, రంగ శ్రీనివాస్, సతీష్, కృష్ణవేణి, అతీయ కౌసర్, అరుణ్ కుమార్ సిఆర్పి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.