by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:50 PM
ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహ కల్ప ప్రాంతానికి చెందిన పారుపల్లు ఉమేశ్ (22 yrs) అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు నగరంలోని కరుణగిరి మున్నేరు వంతెన పై నుంచి కిందకు దూకుడు.
తానే మున్నేరు నీటి నుండి ఈత కొట్టుకుంటూ కాలు కు తగిలిన గాయలతో బయటకు రావడంతో స్ధానికులు కరుణగరి మున్నేరు వంతెన వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వంతెన కిందకు వెళ్లి గాయపడిన వ్యక్తి ని ప్రాధమిక చికిత్స చేసి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. హోటల్ లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం.