by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:54 PM
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి రామారావు కి ఎం సి పి ఐ యు పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చిన మార్త నాగరాజు అనంతరం ఎం సి పిఐయు నల్లబెల్లి మండల సహాయ కార్యదర్శి మార్త నాగరాజు మాట్లాడుతూ బతుకమ్మ మరియు దసరా పండగ వస్తున్న సందర్భంగా గ్రామంలో వీధిలైట్లను ఏర్పాటు చేయాలని అలాగే గుంతలుగా ఉన్న రోడ్ల పునర్నిర్మానం చేయాలని రంగపురంలో కాలనీ కాలనీకి ఎల్ఈడి వీధిలైట్లు ఏర్పాటు.
చేయాలని కోరారు అలాగే ఎస్సీ కాలనీలో సరైన సదుపాయాలు లేక వీధిలైట్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని అన్నారు మహిళలు ఆడవలసిన బతకమ్మ స్థలాన్ని పరిశీలించి ఆ స్థలాన్ని మరమ్మత్తులు చేయాలని కార్యదర్శి నీ కోరారు.