by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:56 PM
హైదరాబాద్ లో హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చటంతో మూసి నిర్వాసితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై కాంగ్రెస్ రౌడీల దాడిని ఖండిస్తున్నాను.కూల్చివేతల్లో సర్వం కోల్పోయిన బాధితులు దిక్కుతోచక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి వీలైతే వెంటనే వారికి ప్రత్యన్మాయాన్ని చూయించడం పై ద్రుష్టి పెట్టాలి.
భాదితులని పరామర్శించడానికి వచ్చిన BRS నాయకులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తుంటే చూసి రాక్షస ఆనందం పొందటం మానుకోవాలి. ఇలాంటి దాడులు బీ అర్ స్ నాయకులను ప్రజల వద్దకు వెళ్లకుండా ఆపలేవు.