![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 06, 2025, 06:09 PM
గౌతమ్ తిన్నురి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రం పరిశ్రమలో సెన్సేషన్ సృష్టిస్తుంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నప్పటికీ రెండు భాగాల మధ్య కథనంలో పెద్దగా తేడా ఉండదని నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులలో ఇది అంచనాలను పెంచింది. తాజాగా లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క టైటిల్ గ్లింప్సె ని ఫిబ్రవరి 14, 2025న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. రానున్న రోజులలో మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సామ్రాజ్యం అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ ఈ చిత్రానికి కథ అందించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Latest News