by Suryaa Desk | Mon, Feb 10, 2025, 04:56 PM
చిత్రనిర్మాత-నటుడు ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ఓహ్ మై కడవులే ఫేమ్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ డ్రాగన్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని ఫిబ్రవరి 10న అంటే ఈరోజు రాత్రి 7 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాంకేతిక సిబ్బందిలో లియోన్ జేమ్స్ (సంగీతం), నికేత్ బొమ్మి (సినిమాటోగ్రఫీ), ప్రదీప్ రాఘవ్ (ఎడిటింగ్) ఉన్నారు. ఈ ద్విభాషా చిత్రం తమిళం మరియు తెలుగులో విడుదలవుతుంది. ప్రదీప్ రంగనాథన్ మరియు అశ్వత్ మరిముత్తుల మధ్య ఉత్తేజకరమైన సహకారాన్ని అందిస్తుంది. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
Latest News