![]() |
![]() |
by Suryaa Desk | Sat, Feb 08, 2025, 04:43 PM
అఖండ 2: తాండవం అనే బ్లాక్బస్టర్ చిత్రం అఖండకు అత్యంత అంచనాలున్న సీక్వెల్. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా టాలెంటెడ్ నటి సంయుక్త నటిస్తుంది. ఇప్పటికే మేకర్స్ కిక్ షూట్ ప్రారంభించి, ట్రైగ్ రాజ్లోని ఐకానిక్ మహా కుంభ మేలా వద్ద కొన్ని సన్నివేశాలను షూట్ చేసారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు స్టార్ హీరో ఆది పినిశెట్టి లాక్ అయ్యినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో సంగీత సంచలనం S థమన్, సినిమాటోగ్రాఫర్ C రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు మరియు ఆర్ట్ డైరెక్టర్ AS ప్రకాష్ సహా ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బంది ఉన్నారు. అఖండ 2: తాండవం బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను ఇద్దరికీ పాన్ ఇండియా అరంగేట్రం చేస్తూ భారతదేశం అంతటా విడుదల కానుంది. ఈ చిత్రం దసరాకు సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలోకి రానుంది. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News