by Suryaa Desk | Tue, Feb 11, 2025, 06:46 PM
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్లాల్ హీరోగా భారీ అంచనాలున్న మలయాళ చిత్రం 'ఎల్2 ఎంపురాన్' మార్చి 27, 2025న థియేటర్లలోకి రానుంది. లూసిఫెర్ ఫ్రాంచైజీలో L2 ఎంపురాన్ రెండవ విడత. మోహన్లాల్ తన ఐకానిక్ పాత్రలో స్టీఫెన్ నెడుంపల్లి అకా ఖురేషి అబ్రమ్గా నటించారు. తాజాగా చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న L2 ఎంపురాన్ లో కీలక పాత్రలో నటిస్తున్న నైలా ఉష, అరుంధతి సంజీవ్ అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్ మరియు అర్జున్ దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేయగా, దీపక్ దేవ్ సంగీతం సమకూర్చారు. అఖిలేష్ మోహన్ ఎడిటర్ గా ఉన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ సారథ్యంలో, మోహన్ లాల్ తారాగణంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ఆంటోని పెరుంబవూర్ మరియు అల్లిరాజా సుభాస్కరన్ సంయుక్తంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Latest News