![]() |
![]() |
by Suryaa Desk | Fri, Feb 07, 2025, 04:24 PM
టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య మరియు సాయి పల్లవిల రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'తాండల్' ఫిబ్రవరి 7న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా కి బుక్ మై షోలో 250K+ టికెట్స్ అమ్ముడైనట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రీకాకుళానికి చెందిన రాజు అనే మత్స్యకారుడిగా చై నటించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకి షామ్దత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్షన్ ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, దివ్య పిళై కీలక పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్పై బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 2018లో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందింది.
Latest News