by Suryaa Desk | Sun, Jul 14, 2024, 10:39 AM
కారు చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిమ్మాజిపేటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఆదివారం ఎస్ఐ నరేందర్ రెడ్డి వివరాలు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం లక్ష్మీ తండాకు చెందిన సంతోష్(30) భార్య శారదతో కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి సొంత కారులో వెళుతుండగా. తిమ్మాజిపేట మలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా. భార్య శారదకు స్వల్ప గాయాలయ్యాయి