by Suryaa Desk | Sun, Jul 14, 2024, 10:43 AM
బెల్లంపల్లి ఏరియా సింగరేణి జిఎం రవిప్రసాద్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి ఆయన మొక్కను బహుకరించారు. బెల్లంపల్లి ఏరియా ఉత్పత్తి, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి కలిసి పనిచేయాల్సిన ఆవశక్యతపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ తిరుపతి, సీనియర్ సెక్యూరిటీ అధికారి వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.