by Suryaa Desk | Sun, Jul 14, 2024, 10:44 AM
అశ్వారావుపేట మండలంలో మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని పలుచోట్ల డ్రైనేజీలు పొంగి వరదనీరు ఇళ్లలోకి చేరుతున్నాయి. శనివారం రాత్రి నుంచి 24. 8 మి. మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయానికి పెద్దవాగు ప్రాజెక్టుకు 300 క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రాజెక్ట్ సామర్థ్యం 557. 890మి క్యూబిక్ ఫీట్ కాగా ప్రస్తుతం 347. 325మి క్యూబిక్ ఫీట్ నీరు చేరింది.