by Suryaa Desk | Sun, Jul 14, 2024, 11:43 AM
రేపు అనగా సోమవారం నారాయణపేట పట్టణంలో నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని మున్సిపల్ కమిషనర్ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదగిరి రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో ఉదయం 10 గంటలకు మొక్కలు నాటుతారని చెప్పారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అధికారులు పాల్గొనాలని ఆమె కోరారు.