by Suryaa Desk | Sun, Jul 14, 2024, 11:46 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ ఆలయమైన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం (గణేష్ టెంపుల్) లో ఆదివారం ఆషాడమాసం సందర్భంగా శాకంబరీ దేవి అలంకరణలో స్వర్ణ దుర్గ అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి సులోచన తెలిపారు.