by Suryaa Desk | Sun, Jul 14, 2024, 11:48 AM
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసెన్ జిత్ మాట్లాడుతూ నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్టీఏ రద్దు చేయాలని, తెలంగాణ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఏ నాయకులు పాల్గొన్నారు.