by Suryaa Desk | Sun, Jul 14, 2024, 12:10 PM
నల్గొండ పట్టణంలో రూ. 700 కోట్లతో చేపట్టే బైపాస్ వలన ఎవరికి నష్టం జరగకుండా పరిహారం ఇచ్చే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్లు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని 5, 20, 21, 43వ వార్డులలో గొల్లగూడెం నుంచి పెద్ద బండ వరకు, కలెక్టరేట్ వద్ద TUFIDC నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు.