by Suryaa Desk | Sun, Aug 11, 2024, 06:16 PM
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, మక్తల్ పట్టణ కేంద్రంలో ఆదివారం శాసనసభ్యులు వాకిటి శ్రీహరి నాయకత్వంలో జరగబోయే రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర బైక్ ర్యాలీలో ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కార్యకర్త, పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.