|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 06:12 PM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ జరిగింది. బడ్జెట్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతీ ప్రశ్నకు సమాధానాలు ఇచ్చారు. ఈ బడ్జెట్ సమావేశం రాష్ట్ర శాసనమండలిలో కూడా జరుగుతోంది. బడ్జెట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కాస్త గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా.. శాసన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదన్నారు. దీనిలో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం డబ్బులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వారికి మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తామన్నారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వ హయంలో అంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలకే రోడ్లు వేశారన్నారు. తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాలను గాలికి వదిలేశారన్నారని విమర్శించారు. అయితే ఆ మూడు చోట్ల రోడ్లకు సింగరేణి నిధులు కూడా వాడారన్నారు. ఈ మేరకు తాను హరీశ్ రావుకు చాలెంజ్ చేశారు. రాష్ట్రమంతా తిరిగి చూద్దాం అని సవాల్ విసరడంతో.. ఈ సవాల్ను హరీశ్ రావు స్వీకరిస్తున్నటు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్ అండ్ బీ పనుల గురించి లెక్కలు తీద్దామని.. రోడ్ల గురించి ఒక రోజు చర్చిద్దామని తెలిపారు. ఇక్కడ స్పీకర్ కలగజేసుకొని.. రాష్ట్రమంతా రోడ్లు వేశామని హరీశ్రావు చెప్పారని.. కానీ.. తమ వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.
అసెంబ్లీలో హహరీశ్ రావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలోనే 32 ఉత్తమ పంచాయతీ అవార్డులు వచ్చాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పంచాయతీకే అవార్డు వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన తీరుకు.. మా పనితీరుకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఉండదన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు.. కానీ రాష్ట్రంలో 200లోపు మందికే వైద్యం అందిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రూ.5 లక్షలకు పైగా 607 మందికి ఆరోగ్యశ్రీ ఫలాలు అందాయన్నారు.