|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 10:56 AM
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం . జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ లను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిషనర్గా ఆర్వీ కర్ణన్. సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీజన. మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్గా వినయ్ కృష్ణా రెడ్డిలను నియమించిన ప్రభుత్వం. వీరితో సహా 10 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ. సింగరేణి సిఎండీగా జ్యోతి బుద్ద ప్రకాష్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో మూడు కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ చట్టం-1955, సెక్షన్-3(1) ప్రకారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది.