బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 01:52 PM
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐలమ్మ చౌక్ వద్ద రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ పితామహుడు, సంఘ సంస్కర్త, వాగ్గేయకారుడు శ్రీ సంత్ గాడ్గే బాబా 152వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షులు డా. వైద్యనాథ్, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, రజక సంఘాల సమితి అధ్యక్షులు నామాల నాగేష్ తదితరులు మాట్లాడుతూ, శ్రీ సంత్ గాడ్గే బాబా పరిసరాల శుభ్రత కోసం, పేద వర్గాల కోసం ఆశ్రమాలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసి సామాజిక సంస్కర్తగా ప్రఖ్యాతి గాంచిన మహనీయులని కొనియాడారు.