![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 01:56 PM
పటాన్చెరు : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ కి చెందిన సన్నీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన లక్ష రూపాయల విలువైన ఎల్ఓసి నీ సన్నీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.