|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:52 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. వరుసగా విచారణ చేస్తుంటే తమకు అనుమానం వస్తోందన్నారు. తెలంగాణభవన్లో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చిందని, దివాలా తీసిన సంస్థకు రూ.6వేల కోట్ల టెండర్లు ఇచ్చారని, సీఎం రేవంత్రెడ్డి బాగోతం బయటపడిందని, రేవంత్ సీఎం కాదు.. ఆయన్ను ఒకరు నడిపిస్తున్నారని తెలిపారు. KLSR కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాడ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు కూడా నిలిపివేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విచారణ పూర్తయ్యే దాక ఈ కంపెనీకి ఇంకో వర్క్ ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. అన్నిటికన్నా మించి KLSR ఫ్రాడ్ మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI, SFIO లేదా ED ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.